సిట్పై CI నాగరాజు షాకింగ్ ఆరోపణలు

AP: విజయవాడ సాయికృష్ణ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కృష్ణలంక CI నాగరాజు విజయవాడ కోర్టుకు సంచలన లేఖ రాశారు. సాయికృష్ణ కేసులో తాను పూర్తిగా నిర్దోషినని, తనపై వచ్చిన ఆరోపణల్లో ఎలాంటి నిజంలేదని లేఖలో పేర్కొన్నారు. సిట్ అధికారులు తనను ఈ కేసులో తప్పుడు ఆధారాలతో అన్యాయంగా ఇరికిస్తున్నారని సీఐ ఆరోపించారు. కస్టడీ విచారణ సమయంలో అధికారులు తనపై థర్డ్ డిగ్రీ ఉపయోగించి శారీరకంగా, మానసికంగా వేధించకుండా తగిన ఆదేశాలు ఇవ్వాలని కోర్టును వేడుకున్నారు. విచారణ ప్రక్రియ అంతా న్యాయవాదుల సమక్షంలోనే జరిగేలా చూడాలని ఆయన లేఖలో కోరారు.



