← Back to news

తెలంగాణ ఉపాధ్యాయుడికి అరుదైన గౌరవం!

By Mahesh· 17 Jul 2026
తెలంగాణ ఉపాధ్యాయుడికి అరుదైన గౌరవం!

TG: టెక్నాలజీపై అవగాహన కల్పించేలా నల్లగొండ జిల్లా కనగల్ మండలానికి చెందిన ఉపాధ్యాయుడు కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి ‘కంప్యూటర్ పిల్లలం’ అనే బాలగేయాన్ని రాశారు. పిల్లలకు సులభంగా అర్థమయ్యే పదాలతో ఈ గేయాన్ని రూపొందించారు. ఈ గేయానికి అరుదైన గౌరవం లభించింది. మహారాష్ట్ర ప్రభుత్వం నాలుగో తరగతి తెలుగు ‘బాలభారతి’ పాఠ్యపుస్తకంలో ఈ గేయాన్ని పాఠ్యాంశంగా చేర్చింది. విద్యావేత్తలు, సాహితీవేత్తలు ఆయన్ను అభినందిస్తున్నారు.

More in TG