తండ్రి అంత్యక్రియలను టీవీలో చూస్తూ ముద్రగడ కుమార్తె కన్నీటి పర్యంతం !
దివంగత కాపు నేత ముద్రగడ పద్మనాభం కడసారి చూపుకు ఆయన కుమార్తె క్రాంతిని అనుమతించకపోవడంతో ఆమె ఇంట్లోనే టీవీ చూస్తూ ఎమోషనల్ అవుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కన్నతండ్రి చివరి చూపుకు అనుమతించక పోవడం దారుణమని కొందరు విమర్శిస్తుంటే ముద్రగడ చివరి కోరిక అదేనని తన కుమార్తెను అనుమతించవద్దని స్పష్టంగా చెప్పారని అందుకే రానివ్వలేదని కుటుంబ సభ్యులు చెప్పారు. మరోవైపు క్రాంతి ఇంట్లోనే టీవీలో తండ్రి అంత్యక్రియలు చూస్తూ గుండెల విసేలా రోదించడం పలువురిని కదిలించింది.



