ఒకే పేరు.. రెండు జీతాలు

TG: జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం జింకలపల్లి గ్రామ పంచాయతీలో డబుల్ జీతాల వ్యవహారం వెలుగుచూసింది. టి.రవి అనే వ్యక్తి పేరుతో ఒకవైపు ట్రాక్టర్ డ్రైవర్గా, మరోవైపు మిషన్ భగీరథ వాటర్మన్గా నమోదు చేసి గత ఐదేళ్లుగా రెండు జీతాలు డ్రా చేస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఉద్యోగికి ఒక జీతం మాత్రమే ఇచ్చి, మరో జీతాన్ని ప్రజాప్రతినిధులు, అధికారులు దుర్వినియోగం చేస్తున్నారని గ్రామస్థులు ఆరోపించారు. ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్కు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.



