← Back to news

‘మోదీ ఫొటో పెట్టాల్సిందే’.. రేషన్ కార్డులపై రఘునందన్

By Mahesh· 14 Aug 2026
‘మోదీ ఫొటో పెట్టాల్సిందే’.. రేషన్ కార్డులపై రఘునందన్

TG: రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న స్మార్ట్ రేషన్ కార్డులపై BJP ఎంపీ రఘునందన్ రావు అభ్యంతరం వ్యక్తం చేశారు. కార్డులపై ప్రధాని మోదీ ఫొటో కచ్చితంగా ఉండాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్న 6 కిలోల బియ్యంలో 5 కిలోలు కేంద్రం ఇస్తున్నవేనని అన్నారు. అలాంటప్పుడు ఒక్క కిలో బియ్యం ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ నేతల ఫొటోలు పెట్టడం ఏంటని ప్రశ్నించారు. కొత్తగా ఎన్ని రేషన్ కార్డులు ఇస్తున్నారో ప్రభుత్వం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.

More in TG