← Back to news

పిల్లలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్యాయత్నం

By డీకే· 21 Jun 2026· Eenadu· ఖమ్మం జిల్లా
పిల్లలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్యాయత్నం

TG: ఖమ్మం జిల్లా ఏదిలాపురం మున్సిపాలిటీలోని గుర్రాలపాడుకు చెందిన బొబ్బాల లింగరాజుకు చింతకాని మండలం నరసింహపురానికి చెందిన స్వాతికి 9ఏళ్ల క్రితం మ్యారేజ్ అయింది. లింగరాజు పాల వ్యాపారంతో పాటు, ఖమ్మంలోని మొబైల్ దుకాణంలో పనిచేస్తున్నాడు. ఏడాది నుంచి ఖమ్మంలోని పంపింగ్ వెల్ రోడ్‌లో అద్దెకు ఉంటున్నారు. భార్యాభర్తలకు గొడవ జరగడంతో, స్వాతి ఇద్దరు కుమారులకు ఎలుకల మందు తాగించి, తాను కూడా తాగింది. స్థానికులు వెంటనే ముగ్గుర్నీ హాస్పిటల్‌కు తరలించారు. ఇద్దరు కుమారులు వేదిక్(7), తనుష్(5) మృతి చెందారు. తల్లి స్వాతి చికిత్స పొందుతోంది.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 23h ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.