← Back to news

అర్హులకు అన్యాయం జరగదు: పొంగులేటి

By dk· 6 Aug 2026· హైదరాబాద్
అర్హులకు అన్యాయం జరగదు: పొంగులేటి

TG: రాష్ట్రంలో 22ఏ నిషేధిత భూముల విషయంలో ఏ అర్హుడికీ అన్యాయం జరగదని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా ఒక్క సెంటు భూమినీ 22ఏ నిషేధిత జాబితాలో చేర్చలేదని వెల్లడించారు. ప్రతి దరఖాస్తు, ఫిర్యాదును చట్టబద్ధంగా పరిశీలించి అర్హులకు న్యాయం చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. హైకోర్టు నిర్దేశించిన 45 రోజుల గడువులోగా పెండింగ్ కేసులను పరిష్కరించాలని మంత్రి సూచించారు.

More in TG