కృష్ణలంక CI నాగరాజుపై హత్యానేరం కేసు

AP: రౌడీషీటర్ గాదె సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా CI నాగరాజుపై హత్యానేరం కేసు నమోదు చేశారు. ఇన్స్పెక్టర్గా పనిచేసిన విజయవాడ కృష్ణలంక PSలోనే ఆయనపై కేసు నమోదైంది. ఈ కేసులో దర్యాప్తు అధికారిగా (IO) ACP దైవప్రసాద్ను, CP రాజశేఖరబాబు నియమించారు. వారు కృష్ణలంకలోని తల్లి విజయలక్ష్మి వాంగ్మూలం తీసుకున్నారు. సుమారుగా 2 గంటలపాటు వారి నుంచి వివరాలు సేకరించారు. అనంతరం కృష్ణలంక పోలీస్స్టేషన్కు చేరుకుని అక్కడి సిబ్బందిని విచారించారు.



