విద్యార్థులపై లాఠీచార్జ్పై సుప్రీం సీరియస్!

నీట్ పేపర్ లీక్పై ఆందోళన చేపట్టిన విద్యార్థులపై లాఠీచార్జ్, పోలీసుల దౌర్జన్యంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. శాంతియుతంగా నిరసన తెలపడం పౌరుల రాజ్యాంగబద్ధమైన హక్కు అని స్పష్టం చేసింది. CJI జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం ఈ ఘటనలపై స్వతంత్ర విచారణకు ఆదేశిస్తూ.. బాధ్యులెంతటివారైనా చట్టం ఊరుకోదని హెచ్చరించింది. అటు గాయపడిన పోలీసుల భద్రత, రక్షణ పరికరాలపైనా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని తెలిపింది.



