కరోనా కలకలం.. సీలేరు పర్యాటకుల ప్రవేశం నిలిపివేత

APలో కరోనా కేసులు పెరుగుతుండటంతో విశాఖపట్నం జిల్లా సీలేరు ప్రాంతంలో అధికారులు అలెర్ట్ అయ్యారు. సీలేరు పవర్ కాంప్లెక్స్ పరిధిలోకి పర్యాటకుల ప్రవేశాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. సీలేరు, డొంకరాయి, పొల్లూరు, మాచ్ఖండ్ జలవిద్యుత్ కేంద్రాలు, రిజర్వాయర్లకు బయటి వ్యక్తుల రాకపోకలపై ఆంక్షలు విధించారు. విద్యుత్ కేంద్రాల్లో పనిచేసే సిబ్బంది ఆరోగ్య భద్రత కోసం మాస్కులు, శానిటైజేషన్, భౌతిక దూరం వంటి కోవిడ్ నిబంధనలు తప్పనిసరి చేశారు. ప్రజలు కూడా మాస్క్లు ధరించి జాగ్రత్తలు పాటించాలని వైద్యాధికారులు సూచించారు.



