ఆ బాధ్యత తండ్రులు కూడా తీసుకోవాలి

AP: నేటి యువత యోగా, ధ్యానం చేయడం అలవాటు చేసుకోవాలని, నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలని CM చంద్రబాబు సూచించారు. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా విజయవాడ అంబేద్కర్ కళావేదికలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పిల్లలే మన రాష్ట్ర సంపద అని, వారితోనే మన ఆర్థిక ప్రగతి ముడిపడి ఉందన్నారు. పిల్లల్ని పెంచే బాధ్యతను కేవలం తల్లులే కాకుండా తండ్రులు కూడా తీసుకోవాలని సూచించారు. ఆడవాళ్లకు మగవాళ్లు అన్ని పనుల్లోనూ సహాయం చేయాలని, ఇంటిపని, వంటపని అని తేడా చూడకూడదన్నారు.



