దశాబ్దాల కల నేడు నిజమైంది: CM

AP: రాయలసీమకు నవశకం మొదలైందని CM చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. కడప జిల్లా జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లెలో స్టీల్ప్లాంట్ నిర్మాణ పనులను కేంద్ర ఉక్కుశాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, JSW సంస్థ చైర్మన్ సజ్జన్ జిందాల్తో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... రాయలసీమ చరిత్రలోనే ఇది ఒక మైలురాయి అని, దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న అందరి కల ఈరోజు నిజమైందని అన్నారు. ఇక్కడ లభించే ఖనిజ సంపదను ఇక్కడే సంపద సృష్టికి వినియోగిస్తామని ప్రకటించారు.



