← Back to news

తప్పుల్లేని ఓటర్‌ జాబితానే ఎస్‌ఐఆర్‌ లక్ష్యం

By Srinivas· 27 Aug 2026

TG: అర్హులైన ప్రతి ఓటరుకు ఓటు హక్కు కల్పిస్తూ తప్పుల్లేని, స్పష్టమైన ఓటర్‌ జాబితా రూపొందించడమే ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ ప్రధాన లక్ష్యమని జిల్లా కలెక్టర్‌ హేమంత్‌ కేశవ్‌ పాటీల్‌ అన్నారు. పెద్దకొత్తపల్లి మండలం వెన్నచర్ల గ్రామంలో నోటీసులు జారీ చేసిన ఓటర్లతో నిర్వహించిన హియరింగ్‌ను కలెక్టర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా ఒక ఓటరు వివరాలను ఆయన స్వయంగా యాప్‌లో అప్‌లోడ్‌ చేశారు. అర్హత ఉన్న ఏ ఒక్క ఓటరు పేరు కూడా జాబితా నుంచి తొలగిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

More in Local