← Back to news

పెట్టుబడుల పేరుతో భారీ సైబర్ మోసం

By DK· 15 Jun 2026· Samayam· హైదరాబాద్‌
పెట్టుబడుల పేరుతో భారీ సైబర్ మోసం

TG: హైదరాబాద్‌‌లోని సనత్‌నగర్‌కు చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగి ఫేస్‌బుక్‌లో అధిక లాభాలు వస్తాయని ఇన్వెస్ట్‌మెంట్ యాడ్ చూశాడు. యాడ్‌పై క్లిక్ చేయడంతో సైబర్‌నేరగాళ్లు అతడిని సంప్రదించారు. ఆన్‌లైన్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాట్‌ఫామ్‌లలో పెట్టుబడులు పెడితే లాభాలు వస్తాయని నమ్మించి వాట్సాప్ గ్రూపుల్లో చేర్చారు. మోసగాళ్లు సూచించిన బ్యాంక్ అకౌంట్లకు మొత్తం రూ.2.22 కోట్లను ట్రాన్స్‌ఫర్ చేశాడు. నకిలీ ఇన్వెస్ట్‌మెంట్ యాప్ డ్యాష్‌బోర్డ్‌లో అతని అకౌంట్‌లో రూ.3.1 కోట్ల బ్యాలెన్స్ ఉన్నట్లు చూపించారు. ఆ డబ్బు విత్‌డ్రా చేసుకునేందుకు ఉద్యోగి పయత్నించగా రాకపోవడంతో పోలీసులను ఆశ్రయించాడు.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 1d ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.