← Back to news

పాపికొండల టూర్ రీస్టార్ట్

By డీకే· 4 Jul 2026· పోలవరం జిల్లా
పాపికొండల టూర్ రీస్టార్ట్

AP: దాదాపు 20రోజుల విరామం తర్వాత పాపికొండల విహారయత్రకు అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. శనివారం నుంచి విహారయాత్ర తిరిగి ప్రారంభించేందుకు పర్యాటక, పోలీస్ శాఖలు అనుమతులు మంజూరు చేశాయి. పోలవరం జిల్లా దేవీపట్నం మండలంలోని గండిపోశమ్మ ఆలయ బోటింగ్ పాయింట్ నుంచి విహారయాత్రలు ప్రారంభం కానున్నాయి. గతనెల 14న గండిపోశమ్మ ఆలయం నుంచి గోదావరి నదిలో పాపికొండల వైపు బయలుదేరిన ఓ ప్రైవేట్ పర్యాటక బోటు సాంకేతిక లోపంతో నదిలోనే నిలిచిపోవడంతో పర్యాటకులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. దీంతో పాపికొండల విహారయాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు.

More in AP