← Back to news

కారులో నుంచి తోసేసి 14లక్షలతో పరారైన దోపిడి ముఠా

By డీకే· 16 Jun 2026· Hmtvlive· తిరుపతి జిల్లా
కారులో నుంచి తోసేసి 14లక్షలతో పరారైన దోపిడి ముఠా

AP: తిరుపతి జిల్లా తడ మండలం వెల్లూరుపాడు విలేజ్‌కు చెందిన రవిచంద్రారెడ్డికి రూపాయికి మూడు రూపాయలు ఇస్తామంటూ ఓ ముఠా సభ్యులు నమ్మించారు. నగదుతో వెళ్తున్న రవి చంద్రారెడ్డిని ముఠా సభ్యులు ఏర్పేడు మేర్లపాక వద్ద కారులో ఎక్కించుకుని రూ.14 లక్షల నగదును లాక్కొని, ఆర్ మల్లవరం వద్ద కారు నుంచి తోసేసి పరారయ్యారు. రవిచంద్రారెడ్డి ఏర్పేడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఏర్పేడు పోలీసులు చిల్లకూరుకు చెందిన శ్రీనివాసులను, జీవకోనకు చెందిన గుణశేఖర్‌ను అదుపులోకి తీసుకున్నారు. నగదుతో పరారైన లక్ష్మీప్రియ, మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 1d ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.