← Back to news

కొడుకును కాపాడబోయి.. తల్లి కూడా చెరువులోకి

By dk· 14 Aug 2026· మహబూబాబాద్ జిల్లా
కొడుకును కాపాడబోయి.. తల్లి కూడా చెరువులోకి

TG: మహబూబాబాద్ జిల్లా కురవి మండలం పిల్లిగుండ్ల తండాలో విషాదం చోటుచేసుకుంది. మొగిలిచర్ల శివారులోని రెడ్డి చెరువులో పడి తల్లి, కుమారుడు మృతి చెందారు. తండాకు చెందిన భూక్య నవ్య (26) తన కుమారుడు అన్వేష్ (9)తో కలిసి పశువులను మేపేందుకు వెళ్లింది. చెరువు సమీపంలో అన్వేష్ ప్రమాదవశాత్తు నీటి గుంతలో పడగా, అతడిని కాపాడేందుకు వెళ్లిన తల్లి కూడా నీటిలో మునిగిపోయినట్లు స్థానికులు తెలిపారు. ఇద్దరూ ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు వెతకగా చెరువులో మృతదేహాలు కనిపించాయి. మృతదేహాలను పోలీసులు బయటకు తీశారు.

More in TG