తెలంగాణలో అరుదైన ఖనిజ నిక్షేపాలు

TG: సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండలం రాయిపల్లి తండా పరిధిలోని పర్వతాపూర్ శివారులో అరుదైన ఖనిజ నిక్షేపాలు బయటపడ్డాయి. ఈ భూముల్లో వెనేడియం, టైటానియం, అల్యూమినస్ లేటరైట్ నిక్షేపాలు ఉన్నట్టు సెంట్రల్ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు గుర్తించారు. ఈ ఖనిఖ నిక్షేపాలు ఎలక్ట్రిక్ బ్యాటరీలు, ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాలతో పాటు ఇంధన నిల్వలకు ఎంతగానో దోహదపడుతాయని చెప్పారు. సెంట్రల్ గవర్నమెంట్ ఆదేశాలమేరకు ఈ ఖనిజ నిక్షేపాలను గుర్తించేందుకు సంబంధిత శాఖాధికారులు పలుమార్లు గ్రామాన్ని సందర్శించారు.



