మా డబ్బుతోనే అంత్యక్రియలు చేయండి

AP: చిత్తూరు జిల్లా పలమనేరు మండలం మండిపేటకోటూరుకు చెందిన దామోదరం(35), నిర్మల(28)లకు దిలీప్(12), శ్రీవిద్య(10) సంతానం. నిర్మల బ్రెయిన్ స్ట్రోక్తో బాధపడుతుంది. అప్పటికే అప్పులు పెరిగిపోయాయి. CMRF నుంచి రూ. లక్ష వచ్చినా సరిపోలేదు. ఇటీవల చెన్నైలోని ఓ హాస్పిటల్కు వెళ్లగా రూ.7లక్షలు ఖర్చవుతుందని, అయినా కోలుకుంటారనే నమ్మకంలేదని డాక్టర్స్ చెప్పారు. దీంతో భార్యాభర్తలు కుంగిపోయారు. ఇద్దరు చిన్నారులకు నిర్మల విషం తాగించి తర్వాత తానూ తాగింది. దామోదరం ఉరేసుకున్నాడు. అంత్యక్రియలకు తమ డబ్బులే వినియోగించాలని కాగితంపై రాసి పెట్టారు.




