హుబ్బళ్లిలో రేప్ బాధితురాలి బిడ్డ అమ్మకం- ఆ మైనర్ మళ్లీ ప్రిగ్నెంట్

కర్ణాటకలోని హుబ్బళ్ళిలో అత్యంత ఘోరమైన ఘటన వెలుగుచూసింది. 2025లో పలుమార్లు లైంగిక దాడికి గురై ప్రిగ్నెంట్ అయిన ఒక మైనర్ బాలికకు పుట్టిన శిశువును, ఆమె తల్లిదండ్రులు వేరే కుటుంబానికి అమ్మేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ప్రస్తుతం ఆ బాలిక మళ్లీ గర్భం దాల్చడం కలకలం రేపింది. ఈ ఘటనపై నిందితుడితో పాటు, గర్భాన్ని దాచిపెట్టిన తల్లిదండ్రులు, లీగల్ ప్రొసీజర్స్ పాటించకుండా ట్రీట్మెంట్ ఇచ్చిన ఇద్దరు ప్రైవేట్ వైద్యులపై పోక్సో (POCSO) , భారతీయ న్యాయ సంహిత (BNS) కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.



