నీటి గుంతలో పడి అక్కాచెల్లెళ్లు మృతి

AP: కడప జిల్లా కాజీపేట మండలం దుంపలగట్టులో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు ఆడపిల్లలు నీటి గుంతలో పడి మృతి చెందారు. దుంపలగట్టు విలేజ్కు చెందిన అక్కాచెల్లెళ్లు సంజన(18), అర్చన (14) తమ పందులకు నీళ్లు తాపడం కోసం పొలం పరిసరాల్లోకి వెళ్లారు. అక్కడ ఉన్న నీటిగుంతలో ఒకరు పడిపోగా, వారిని రక్షించే క్రమంలో మరొకరు మునిగిపోయారు. ఇద్దరికీ ఈత రాకపోవడంతో ఊపిరాడక ప్రాణాలు విడిచారు. గమనించిన స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. ఇద్దరి డెడ్బాడీలను బయటకు తీశారు.



