రైల్వే ట్రాక్పై షాకింగ్ ఘటన

AP: ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం చేబ్రోలు రైల్వేస్టేషన్ సమీపంలో రైలు ఢీకొని నలుగురు మృతి చెందారు. మృతదేహాలు ఛిద్రమై గుర్తుపట్టలేనంతగా మారిపోయాయి. సమాచారం అందుకున్న తాడేపల్లిగూడెం రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని డెడ్బాడీలను పరిశీలించారు. నలుగురు ఒకే కుటుంబానికి చెందిన వారై ఉంటారని.. వారంతా సూసైడ్ చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. మృతుల వయసు 30 నుంచి 35 ఏళ్ల మధ్యలో ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.



