← Back to news

ఆగస్టు 8న ‘ద్రవిడ’ పుస్తకావిష్కరణ

By విశీ· 4 Aug 2026
ఆగస్టు 8న ‘ద్రవిడ’ పుస్తకావిష్కరణ

TG: ద్రవిడ రాష్ట్రాలపై సాగుతున్న వివక్ష గురించి గొంతెత్తుతూ రచయితలు, సామాజికవేత్తలు రాసిన వ్యాసాలు ‘ద్రవిడ’ పేరుతో పుస్తకంగా రాబోతోంది. ఈ పుస్తకానికి కె.ఎన్.మల్లీశ్వరి, కాత్యాయని విద్మహే సంపాదకులుగా ఉన్నారు. ‘మలుపు’ ప్రచురణలు పబ్లిష్ చేసే ఈ పుస్తకాన్ని ఈనెల 8న సాయంత్రం 5.30 గంటలకు హైదరాబాద్ నగరంలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆవిష్కరిస్తారు. సభకు అధ్యక్షులుగా తిరునగరి దేవకీదేవి ఉంటారు. ముఖ్యఅతిథిగా నటుడు, సామాజికవేత్త ప్రకాశ్‌రాజ్ హాజరవుతారు.

More in TG