డబుల్ మర్డర్ కేసులో కోర్టు సంచలన తీర్పు

TG: రాజన్నసిరిసిల్ల జిల్లాలో సంచలనం సృష్టించిన డబుల్ మర్డర్ కేసులో నిందితుడికి జిల్లా కోర్ట్ జీవితఖైదు విధిస్తూ తీర్పునిచ్చినట్లు జిల్లా SP మహేష్ బి. గితే తెలిపారు. గంభీరావుపేట పోలీస్స్టేషన్లో నమోదైన రెండు వేర్వేరు హత్య కేసుల్లో నిందితుడు వంగా సందీప్ రెడ్డికి కోర్ట్ యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. 2018లో కొత్తపల్లి గ్రామానికి చెందిన బీనబోయిన దేవయ్యను, 2022లో కామారెడ్డి జిల్లాకు చెందిన మన్నె నరసింహులును భూవివాదాల నేపథ్యంలో హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. సాంకేతిక ఆధారాలు, 20 మంది సాక్షుల వాంగ్మూలాలను కోర్టు పరిగణనలోకి తీసుకుని నిందితుడికి జీవిత ఖైదు విధించింది.



