← Back to news

విద్యుత్ ఉద్యోగుల మహా ధర్నా

By DK· 16 Jul 2026· తిరుపతి జిల్లా
విద్యుత్ ఉద్యోగుల మహా ధర్నా

AP: ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు తిరుపతిలోని APSPDCL కార్యాలయం ముందు మహా ధర్నా నిర్వహించారు. రెగ్యులరైజేషన్, పాత పెన్షన్ విధానం అమలు, PRC ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల మేరకు విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసి వారికి రూ.48 వేల వేతనాన్ని ఇవ్వాలని కోరారు. విధి నిర్వహణలో మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు రూ. 1 కోటి పరిహారం చెల్లించాలని కోరారు.

More in AP