← Back to news

ఆషాఢం ఆఫర్ అంటూ గ్రామస్తులకు టోకరా

By DK· 14 Jul 2026
ఆషాఢం ఆఫర్ అంటూ గ్రామస్తులకు టోకరా

AP:కోనసీమ జిల్లా మలికిపురం మండలం విశ్వేశ్వరాయపురంలో గుర్తుతెలియని ఓ వ్యక్తి గ్రామంలోకి వచ్చి లక్కీ డ్రాలో చేరితే ఆకర్షణీయమైన బహుమతులు ఇస్తామని ప్రచారం చేశాడు. ఆషాడం ప్రత్యేక ఆఫర్ పేరుతో ఫ్రిజ్, ఎయిర్ కూలర్, డబుల్ కాట్ మంచం, వాషింగ్ మెషిన్, బైక్‌ల వంటి ఖరీదైన వస్తువులను అతితక్కువ ధరకే అందిస్తామని నమ్మించాడు. రోజువారీ కూలీలే లక్ష్యంగా పలువురి నుంచి నగదు, ఫోన్‌పే ద్వారా వేలాది రూపాయలు వసూలు చేశాడు. డబ్బు చేతికి రాగానే మొబైల్ ఫోన్‌ను స్విచ్ ఆఫ్ చేసి పరారయ్యాడు. బాధితులు మలికిపురం PSలో ఫిర్యాదు చేశారు.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 19h ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.