ఆషాఢం ఆఫర్ అంటూ గ్రామస్తులకు టోకరా

AP:కోనసీమ జిల్లా మలికిపురం మండలం విశ్వేశ్వరాయపురంలో గుర్తుతెలియని ఓ వ్యక్తి గ్రామంలోకి వచ్చి లక్కీ డ్రాలో చేరితే ఆకర్షణీయమైన బహుమతులు ఇస్తామని ప్రచారం చేశాడు. ఆషాడం ప్రత్యేక ఆఫర్ పేరుతో ఫ్రిజ్, ఎయిర్ కూలర్, డబుల్ కాట్ మంచం, వాషింగ్ మెషిన్, బైక్ల వంటి ఖరీదైన వస్తువులను అతితక్కువ ధరకే అందిస్తామని నమ్మించాడు. రోజువారీ కూలీలే లక్ష్యంగా పలువురి నుంచి నగదు, ఫోన్పే ద్వారా వేలాది రూపాయలు వసూలు చేశాడు. డబ్బు చేతికి రాగానే మొబైల్ ఫోన్ను స్విచ్ ఆఫ్ చేసి పరారయ్యాడు. బాధితులు మలికిపురం PSలో ఫిర్యాదు చేశారు.



