కరెంట్ ఛార్జీలు పెంచం

AP: కూటమి ప్రభుత్వం మూడో ఏడాదిలోకి అడుగు పెట్టినప్పటికీ విద్యుత్ ఛార్జీలు పెంచలేదని, ఐదేళ్లపాటు విద్యుత్ ఛార్జీలు పెంచబోమని CM చంద్రబాబు స్పష్టం చేశారు. సచివాలయంలో మంత్రులు, వివిధ విభాగాల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజల సమస్యలు, వాస్తవాలు తెలియాలంటే ఉన్నతస్థాయి అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లాలన్నారు. వినూత్న ఆలోచనలతో ప్రజలకు సుపరిపాలనను అందించాలని సూచించారు. పట్టిసీమ నీటితో గోదావరి నుంచి కృష్ణా డెల్టా ఆయకట్టుకు నీరు అందిస్తున్నట్లు పేర్కొన్నారు.



