అప్పులు తీర్చలేక తల్లిని చంపిన కొడుకు

AP: ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేటకు చెందిన రఘువంశీ హైదరాబాద్లో మెకానిక్గా పనిచేస్తున్నాడు. జల్సాలకు అలవాటుపడిన యువకుడు భారీగా అప్పులు చేశాడు. వాటిని తీర్చడం కోసం విస్సన్నపేటలో ఉన్న తమ ఇల్లు అమ్మాలంటూ తన తల్లి రమాదేవిపై గత కొంతకాలంగా ఫ్రెజర్ చేశాడు. అయితే ఇల్లు అమ్మడానికి ఆమె నిరాకరించడంతో తీవ్ర కక్ష పెంచుకున్న కుమారుడు దారుణంగా కొట్టి ఆమెను హతమార్చాడు. విస్సన్నపేట పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిని అరెస్ట్ చేసి దర్యాప్తు చేపట్టారు.



