← Back to news

మోసాల దేశగురువు.. పోలీసులకు చెప్పడంతో పరార్

By DeeKay· 16 Jun 2026· Eenadu· రాజన్నసిరిసిల్ల జిల్లా
మోసాల దేశగురువు.. పోలీసులకు చెప్పడంతో పరార్

TG: రాజన్నసిరిసిల్ల జిల్లా చందుర్తి, వేములవాడ మండలాల్లోని పలు గ్రామాల్లో దేశగురువు సంచరించాడు. చందుర్తి మండలం నర్సింగాపూర్‌ గ్రామంలోని ఓ సంఘ భవనంలో ఆశ్రయం తీసుకున్నాడు. గుర్రం మీద స్వారీ చేసుకుంటూ ఇళ్ల వద్దకు వెళ్లిన ఆ గురువు ప్రవర్తన చూసి గ్రామస్థులు కంగుతిన్నారు. మహిళలను చూసి అసభ్యకరంగా సైగలు చేసేవాడని వారు తెలిపారు. ఆయన అనుచరులు మాయమాటలు చెప్పి గ్రామస్థుల నుంచి డబ్బులు వసూలు చేశారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో దేశగురువు పరారయ్యాడు.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 1d ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.