మోసాల దేశగురువు.. పోలీసులకు చెప్పడంతో పరార్

TG: రాజన్నసిరిసిల్ల జిల్లా చందుర్తి, వేములవాడ మండలాల్లోని పలు గ్రామాల్లో దేశగురువు సంచరించాడు. చందుర్తి మండలం నర్సింగాపూర్ గ్రామంలోని ఓ సంఘ భవనంలో ఆశ్రయం తీసుకున్నాడు. గుర్రం మీద స్వారీ చేసుకుంటూ ఇళ్ల వద్దకు వెళ్లిన ఆ గురువు ప్రవర్తన చూసి గ్రామస్థులు కంగుతిన్నారు. మహిళలను చూసి అసభ్యకరంగా సైగలు చేసేవాడని వారు తెలిపారు. ఆయన అనుచరులు మాయమాటలు చెప్పి గ్రామస్థుల నుంచి డబ్బులు వసూలు చేశారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో దేశగురువు పరారయ్యాడు.



