← Back to news

అర్ధరాత్రి ఎలక్ట్రిక్ బస్సులో చెలరేగిన మంటలు

By డీకే· 1 Jul 2026· కరీంనగర్ జిల్లా
అర్ధరాత్రి ఎలక్ట్రిక్ బస్సులో చెలరేగిన మంటలు

TG: కరీంనగర్ బస్ డిపో-2లో మంగళవారం అర్ధరాత్రి దాటాక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. డిపో ఆవరణలో పార్కింగ్ చేసిన TGSRTC ఎలక్ట్రికల్ ఎక్స్‌ప్రెస్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు బస్సు మొత్తానికి వ్యాపించి క్షణాల్లోనే వాహనం పూర్తిగా దగ్ధమైంది. ప్రమాద సమయంలో బస్సులో ప్రయాణికులెవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. రాష్ట్రంలో ఎలక్ట్రిక్ బస్సుల్లో ఈ తరహా అగ్నిప్రమాదం జరగడం ఇది వరుసగా మూడోసారి.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 20h ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.