← Back to news

సాయం చేద్దామని వెళ్లి గోదావరిలో గల్లంతు

By డీకే· 15 Jun 2026· Eenadu· ఏలూరు జిల్లా
సాయం చేద్దామని వెళ్లి గోదావరిలో గల్లంతు

AP: ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం రుద్రంకోట విలేజ్‌కు చెందిన కనితిరెడ్డి రాంబాబు, హేమంత్‌కుమార్ స్నేహితులు. హేమంత్‌కుమార్‌కు చెందిన గేదెలు రుద్రమ్మకోట సమీపంలో గోదావరి నది అవతలి ఒడ్డుపై ఉన్నాయి. వాటిని తోలుకు వచ్చేందుకు హేమంత్, ఆయనకు సాయం చేసేందుకు రాంబాబు కలిసి లోతు తక్కువ ఉండే వైపు నడిచివెళ్లారు. తిరిగి గేదెలను ఇంటికి తీసుకొచ్చే క్రమంలో రాంబాబు లోతు ఎక్కువగా ఉండే వైపు వెళ్లి గల్లంతయ్యాడు. గల్లంతైన రాంబాబు కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు చేపట్టారు. అయినా మృతదేహం ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 1d ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.