గూగుల్లో 'హత్య' పాఠాలు!

పుణెకు చెందిన యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో మైండ్ బ్లోయింగ్ విషయాలు బయటపడ్డాయి. నిందితులు సియా గోయల్, చేతన్ చౌదరీలను విచారించగా.. కేతన్ను ఎలా చంపాలో చాలా రోజుల ముందు నుంచే ఆన్లైన్లో రకరకాలుగా సెర్చ్ చేసినట్లు పోలీసులు కనుగొన్నారు. పక్కా ప్లాన్తో జూన్ 18న లోహగడ్ కోట వద్ద కేతన్ను లోయలోకి తోసి చంపేశారు. అంతేకాదు, వీరిద్దరూ గత 6 నెలల్లో ఏకంగా 2004 సార్లు ఫోన్ కాల్స్ మాట్లాడుకుని, 238 గంటల పాటు మర్డర్ ప్లాన్ గురించే డిస్కస్ చేసినట్లు డిజిటల్ ఆధారాల ద్వారా తేలింది. ఈ డిజిటల్ ఫుట్ప్రింట్, సెర్చ్ హిస్టరీనే ఇప్పుడు నిందితులను బుక్ చేసింది.



