← Back to news

పేలిన కూలర్.. పెంకుటింట్లో మంటలు

By DeeKee· 20 Jun 2026· Hmtvlive· కోనసీమ జిల్లా
పేలిన కూలర్.. పెంకుటింట్లో మంటలు

AP: బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం మెరకపాలెంలో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన ఫైర్ యాక్సిడెంట్‌లో మూడు కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి. కోరుకొండ బాబురావు, కోరుకొండ కృష్ణమూర్తి కుటుంబాలు, తదితరులు ఒకే ఇంట్లో ఉంటున్నారు. ఇంట్లో ఉన్న కూలర్‌ లోవోల్టెజ్‌తో పేలడంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. అప్పటికే ఇంట్లోని వస్తువులు, ఇతర సామగ్రి పూర్తిగా దగ్ధమయ్యాయి. సుమారు రూ.5లక్షల ఆస్తినష్టం జరిగినట్లు ఫైర్ సిబ్బంది ప్రాథమికంగా అంచనా వేశారు. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 1d ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.