పేలిన కూలర్.. పెంకుటింట్లో మంటలు

AP: బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం మెరకపాలెంలో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన ఫైర్ యాక్సిడెంట్లో మూడు కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి. కోరుకొండ బాబురావు, కోరుకొండ కృష్ణమూర్తి కుటుంబాలు, తదితరులు ఒకే ఇంట్లో ఉంటున్నారు. ఇంట్లో ఉన్న కూలర్ లోవోల్టెజ్తో పేలడంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. అప్పటికే ఇంట్లోని వస్తువులు, ఇతర సామగ్రి పూర్తిగా దగ్ధమయ్యాయి. సుమారు రూ.5లక్షల ఆస్తినష్టం జరిగినట్లు ఫైర్ సిబ్బంది ప్రాథమికంగా అంచనా వేశారు. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.



