← Back to news

తండ్రికి ఫోన్‌ చేసి.. గోదావరిలో దూకిన కానిస్టేబుల్

By డీకే· 20 Jun 2026· Hmtvlive· రాజమహేంద్రవరం
తండ్రికి ఫోన్‌ చేసి.. గోదావరిలో దూకిన కానిస్టేబుల్

AP: తూర్పుగోదావరి జిల్లా శ్రీరాంపురానికి చెందిన చంద్రమళ్ల వంశీ(31) కాకినాడ APSP మూడో బెటాలియన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. వంశీకి కుటుంబసభ్యులు పెళ్లి సంబంధం చూసి నిశ్చితార్థానికి ఏర్పాట్లు చేశారు. అప్పటికే పరిచయం ఉన్న ఓ మహిళా కానిస్టేబుల్‌, రాజమహేంద్రవరం మహిళా PSలో వంశీపై ఫిర్యాదు చేశారు. పోలీసులు పలుమార్లు వంశీని స్టేషన్‌కు పిలిపించి విచారించారు. వంశీ తన తండ్రికి ఫోన్‌ చేసి తాను గోదావరి నదిలోకి దూకుతున్నట్లు చెప్పి సూసైడ్ చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 23h ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.