తండ్రికి ఫోన్ చేసి.. గోదావరిలో దూకిన కానిస్టేబుల్

AP: తూర్పుగోదావరి జిల్లా శ్రీరాంపురానికి చెందిన చంద్రమళ్ల వంశీ(31) కాకినాడ APSP మూడో బెటాలియన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నాడు. వంశీకి కుటుంబసభ్యులు పెళ్లి సంబంధం చూసి నిశ్చితార్థానికి ఏర్పాట్లు చేశారు. అప్పటికే పరిచయం ఉన్న ఓ మహిళా కానిస్టేబుల్, రాజమహేంద్రవరం మహిళా PSలో వంశీపై ఫిర్యాదు చేశారు. పోలీసులు పలుమార్లు వంశీని స్టేషన్కు పిలిపించి విచారించారు. వంశీ తన తండ్రికి ఫోన్ చేసి తాను గోదావరి నదిలోకి దూకుతున్నట్లు చెప్పి సూసైడ్ చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.



