హైడ్రా కమిషనర్ రంగనాథ్కు 50వేల జరిమానా

TG: హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్కు రూ.50వేల జరిమానా విధిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీచేసింది. ఖైరతాబాద్ మండలం యూస్ఫగూడ గ్రామపరిధిలోని సర్వే నెంబర్ 45లోని రెండుఎకరాల భూమికి ఉన్న ప్రహరీ గోడను హైడ్రా ఏకపక్షంగా కూల్చివేసిందని ఆరోపిస్తూ మహ్మద్ షఫహతుల్లా దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు విచారించింది. కౌంటర్ దాఖలు చేయడానికి చివరి అవకాశం ఇచ్చినప్పటికీ హైడ్రా కౌంటర్లు దాఖలు చేయకుండా స్టేటస్ కో ఉత్తర్వులు ఉల్లంఘించడంపై హైకోర్ట్ జరిమానా విధించింది.



