← Back to news

హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌కు 50వేల జరిమానా

By DK· 13 Jun 2026· Ntnews· హైదరాబాద్‌
హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌కు 50వేల జరిమానా

TG: హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌కు రూ.50వేల జరిమానా విధిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీచేసింది. ఖైరతాబాద్‌ మండలం యూస్‌ఫగూడ గ్రామపరిధిలోని సర్వే నెంబర్‌ 45లోని రెండుఎకరాల భూమికి ఉన్న ప్రహరీ గోడను హైడ్రా ఏకపక్షంగా కూల్చివేసిందని ఆరోపిస్తూ మహ్మద్‌ షఫహతుల్లా దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు విచారించింది. కౌంటర్‌ దాఖలు చేయడానికి చివరి అవకాశం ఇచ్చినప్పటికీ హైడ్రా కౌంటర్లు దాఖలు చేయకుండా స్టేటస్‌ కో ఉత్తర్వులు ఉల్లంఘించడంపై హైకోర్ట్ జరిమానా విధించింది.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 1d ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.