దొంగ నోట్ల ముఠా గుట్టురట్టు

AP: అనంతపురం నగరంలోని వన్టౌన్ PS పరిధిలోని శారదనగర్లో ఓ ఇంట్లో దొంగ నోట్లను ముద్రిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. అనంతపురానికి చెందిన రాజు, సురేష్ అనే ఇద్దరు నిందితులు రాత్రి 10గంటల సమయంలో దొంగనోట్లను ముద్రిస్తుండగా పోలీసులు అరెస్ట్ చేశారు. విజయవాడకు చెందిన మరికొందరు వ్యక్తులు ముఠాగా ఏర్పడి దొంగ నోట్లను ముద్రించి చలామణి చేస్తున్నట్లు గుర్తించారు. వారి నుంచి దొంగ నోట్ల ప్రింటింగ్ మెషన్, ల్యాప్టాప్, సెల్ఫోన్లు, నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు.



