← Back to news

దొంగ నోట్ల ముఠా గుట్టురట్టు

By DK· 3 Jul 2026· అనంతపురం జిల్లా
దొంగ నోట్ల ముఠా గుట్టురట్టు

AP: అనంతపురం నగరంలోని వన్‌టౌన్ PS పరిధిలోని శారదనగర్‌లో ఓ ఇంట్లో దొంగ నోట్లను ముద్రిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతపురానికి చెందిన రాజు, సురేష్ అనే ఇద్దరు నిందితులు రాత్రి 10గంటల సమయంలో దొంగనోట్లను ముద్రిస్తుండగా పోలీసులు అరెస్ట్ చేశారు. విజయవాడకు చెందిన మరికొందరు వ్యక్తులు ముఠాగా ఏర్పడి దొంగ నోట్లను ముద్రించి చలామణి చేస్తున్నట్లు గుర్తించారు. వారి నుంచి దొంగ నోట్ల ప్రింటింగ్ మెషన్, ల్యాప్‌టాప్, సెల్‌ఫోన్లు, నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 20h ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.