బూడిదవుతున్న వాషింగ్టన్!

అమెరికాలోని వాషింగ్టన్ రాష్ట్రాన్ని దారుణమైన కార్చిచ్చు ముంచెత్తింది. ఏకంగా 16 ప్రాంతాల్లో మంటలు తీవ్రరూపం దాల్చడంతో వందలాది భవనాలు కాలిపోయాయి. వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు, మరో 60 వేల మందిని సేఫ్ గా ఉండే షెల్టర్లకు తరలించారు. పరిస్థితి చేయిదాటడంతో గవర్నర్ బాబ్ ఫెర్గూసన్ రాష్ట్రవ్యాప్తంగా అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. బలమైన గాలులు, పొడి వాతావరణం కారణంగా మంటలను కంట్రోల్ చేయడం రెస్క్యూ టీమ్లకు సవాలుగా మారింది. సేఫ్టీ కారణాల వల్ల డ్రోన్లు ఎగరేయడాన్ని అధికారులు ఆపేశారు.



