సమాజానికి తిరిగి ఇవ్వాలి: హరీశ్ రావు

TG: నాకు సమాజం ఏం చేసిందని అడిగేవాళ్లే కానీ, మేము సమాజానికి ఏం చేయగలమని ఆలోచించాలని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. సిద్దిపేటలో నవజీవన్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రతిభ అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉద్యోగులు తమ వేతనం నుంచి ప్రతినెలా రూ.1,000 చొప్పున పక్కనపెట్టి రూ.10లక్షల నిధిని ఏర్పాటు చేయడం గర్వకారణమని ప్రశంసించారు. పదోతరగతిలో ప్రతిభ కనబరిచిన దళిత విద్యార్థులకు అవార్డులు అందజేశారు. పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు అందిస్తున్న సొసైటీ సేవలు ఆదర్శనీయమని కొనియాడారు.



