కోర్టుకు అల్లు అర్జున్ స్వయంగా వెళ్ళాల్సిందే?

హైదరాబాద్లోని సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్కు గట్టి షాక్ తగిలింది. ఈ కేసును విచారిస్తున్న నాంపల్లి కోర్టు అల్లు అర్జున్తో పాటు మరో 19 మందికి సడన్గా కోర్టు నోటీసులు పంపించింది. ఈ కేసులో అల్లు అర్జున్ను 11వ నిందితుడిగా చేర్చిన పోలీసులు, ఇప్పటికే మొత్తం 23 మందిపై ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేశారు. ఈ క్రమంలోనే సోమవారం (june 22) రోజు అల్లు అర్జున్ స్వయంగా కోర్టుకు వచ్చి హాజరుకావాలని ఆర్డర్ వేశారు. పుష్పా 2 ప్రీమియర్ షో టైమ్లో జరిగిన ఈ ఇన్సిడెంట్ కేసు ఇప్పుడు ఈ కోర్టు నోటీసులతో మళ్లీ హాట్ టాపిక్గా మారింది.



