ప్రియుడి ఫ్రెండ్స్ ప్రెజర్తో యువతి ఆత్మహత్య

AP: కాకినాడ జిల్లా తుని పట్టణానికి చెందిన రజిని, రాజేంద్ర నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇటీవల రజినికి కుటుంబసభ్యులు పెళ్లి నిశ్చయించారు. దీంతో మనస్తాపానికి గురైన రాజేంద్ర ఆత్మహత్యాయత్నం చేశాడు. అతని స్నేహితులు రజినిపై పెళ్లి రద్దు చేసి రాజేంద్రను వివాహం చేసుకోవాలని ఒత్తిడి చేశారు. ఇంటి వారిని బాధపెట్టలేక, ప్రియుడిని వదులుకోలేక రజిని తీవ్ర మనస్థాపానికి గురై సూసైడ్ చేసుకుంది. సూసైడ్ నోట్లో “చనిపోవాలని లేదు.. ఏం చేయాలో తెలియడం లేదు” అని రాసింది. యువతి మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.



