APలో మళ్ళీ రెండు లాక్అప్ డెత్ లు జరిగాయా?

APలో పోలీసుల తీరుపై వరుస ఘటనలు చర్చనీయాంశమవుతున్నాయి. నెల్లూరు జిల్లా మనుబోలులో బొల్లి ఏడుకొండలు పోలీస్ కస్టడీలో మృతిచెందగా, అది లాకప్ డెత్ అని కుటుంబం ఆరోపిస్తోంది. పోలీసులు మాత్రం ఆయన విషం తాగాడని చెబుతున్నారు. మరోవైపు పిడుగురాళ్లలో ఉర్దూ అకాడమీ లైబ్రేరియన్ షేక్ దరియా హుస్సేన్ ఆత్మహత్యకు పోలీసుల వేధింపులే కారణమని కుటుంబం ఆరోపిస్తోంది. రెండు ఘటనలపైనా పారదర్శక విచారణ జరిపి నిజాలు వెలుగులోకి తేవాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.




