← Back to news

APలో మళ్ళీ రెండు లాక్అప్ డెత్ లు జరిగాయా?

By sahani· 16 Jul 2026· AP
APలో మళ్ళీ రెండు లాక్అప్ డెత్ లు జరిగాయా?

APలో పోలీసుల తీరుపై వరుస ఘటనలు చర్చనీయాంశమవుతున్నాయి. నెల్లూరు జిల్లా మనుబోలులో బొల్లి ఏడుకొండలు పోలీస్ కస్టడీలో మృతిచెందగా, అది లాకప్ డెత్ అని కుటుంబం ఆరోపిస్తోంది. పోలీసులు మాత్రం ఆయన విషం తాగాడని చెబుతున్నారు. మరోవైపు పిడుగురాళ్లలో ఉర్దూ అకాడమీ లైబ్రేరియన్ షేక్ దరియా హుస్సేన్ ఆత్మహత్యకు పోలీసుల వేధింపులే కారణమని కుటుంబం ఆరోపిస్తోంది. రెండు ఘటనలపైనా పారదర్శక విచారణ జరిపి నిజాలు వెలుగులోకి తేవాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

APలో మళ్ళీ రెండు లాక్అప్ డెత్ లు జరిగాయా?

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 17h ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.