← Back to news

ఓవర్ స్పీడ్‌తో మహిళలపై దూసుకెళ్లిన బొలెరో

By DK· 9 Jul 2026· రంగారెడ్డి జిల్లా
ఓవర్ స్పీడ్‌తో మహిళలపై దూసుకెళ్లిన బొలెరో

TG: రంగారెడ్డి జిల్లాలో శంషాబాద్ పరిధిలోని సాతంరాయి వద్ద బస్టాప్‌లో బస్సు కోసం వేచి చూస్తున్న మహిళలపైకి ఓవర్ స్పీడ్‌తో వచ్చిన బొలెరో దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో సుమ, సువర్ణ అనే ఇద్దరు మహిళలు తీవ్ర గాయాలతో స్పాట్‌లోనే చనిపోయారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. శంషాబాద్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని డెడ్‌బాడీలను పోస్ట్‌మార్టం నిమిత్తం హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అధికారులు నిర్లక్ష్యం వీడి వెంటనే ఇక్కడ జీబ్రా క్రాసింగ్, స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేయాలని స్థానికులు ఆందోళన చేపట్టారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 19h ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.