ప్రాజెక్టులు వెలవెల.. సాగునీటిపై ఆందోళన

AP: రాష్ట్రంలోని గోదావరి, కృషా నదుల పరీవాహక ప్రాంతాల్లోని జలాశయాల్లోకి జూన్ నెల దాటుతున్నా నీటి ప్రవాహాలు పెద్దగా రాలేదు. మిగతా ప్రాజెక్టులదీ అదే పరిస్థితి. దీంతో వాటి పరిధిలో ఉన్న ఆయకట్టుకు జులైలో వివిధ తేదీల్లో సాగునీటి విడుదల ప్రణాళికలపై పునరాలోచన తప్పేలా లేదు. గత ఏడాది రాష్ట్రంలోని వివిధ జలాశయాల్లో ఈ పాటికి 564.39 TMCల నీటి నిల్వలుండగా.. ఈ ఏడాది ఇప్పటివరకు 416 TMCలే ఉన్నాయి. భారీ సాగునీటి ప్రాజెక్టుల్లో గత సంవత్సరం 524 TMCల నీటి నిల్వలుంటే.. ప్రస్తుతం 381.33 TMCలు మాత్రమే ఉండటం ఆందోళనకు గురిచేస్తుంది.



