ఇరాన్ ఒక్కసారిగా సైలెంట్..!

ఇన్ని రోజులుగా మిస్సైళ్లతో ఒకరిపై ఒకరు విరుచుకుపడిన అమెరికా-ఇరాన్.. ఇప్పుడు కాస్త కూల్ అయినట్టు కనిపిస్తోంది. "ప్రస్తుతానికి ప్రతీకార దాడులు ఆపేస్తున్నాం" అని ఇరాన్ ప్రకటించింది. అటు ట్రంప్ కూడా "చర్చలకు కొంచెం టైమ్ ఇస్తున్నాం" అని చెప్పడంతో గత రెండు రోజులుగా అమెరికా నుంచి కూడా కొత్త దాడులు జరగలేదు. దీంతో వెస్ట్ ఆసియాలో టెన్షన్ కాస్త తగ్గినట్టే కనిపిస్తోంది. అయితే ఈ నిశ్శబ్దం శాశ్వతమా.. లేక మరోసారి యుద్ధం మొదలవుతుందా అనేదే ఇప్పుడు ప్రపంచం మొత్తం చూస్తోంది.



