ఏపీలో కారుణ్య మరణాలకు లైన్ క్లియర్ !

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. రాష్ట్రంలో కారుణ్య మరణాలకు (ప్యాసివ్ యుథనేషియా) సంబంధించిన మార్గదర్శకాలకు వైద్య ఆరోగ్య మంత్రి సత్యకుమార్ ఆమోదం తెలిపారు. తాజా నిబంధనలతో ఇకపై వైద్యులు, రోగుల కుటుంబ సభ్యులు తీసుకునే నిర్ణయాలకు చట్టబద్ధత లభించనుంది. కోలుకునే అవకాశం లేక, చివరి దశలో ఉండి తీవ్ర నరకం అనుభవిస్తున్న రోగులకు మరియు వారి కుటుంబాలకు ఈ తాజా మార్గదర్శకాలు పెద్ద ఊరటనివ్వనున్నాయి.



