← Back to news

ఆస్తి కోసం అత్తను చంపింది

By DK· 17 Jul 2026· సూర్యాపేట జిల్లా
ఆస్తి కోసం అత్తను చంపింది

TG: సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం తూర్పుగూడెంలో కొణతం భాగ్యమ్మ అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో మృతురాలి కోడలు మధురనే హత్య చేసినట్లు తేలింది. భాగ్యమ్మకు 6ఎకరాల భూమి ఉంది. భూమిలో వాటా కావాలని కుమార్తె శోభారాణి కోర్టులో కేసు వేసింది. దీంతో అత్తా, కోడళ్ల మధ్య గొడవలు జరుగుతున్నాయి. అత్తను చంపాలని డిసైడ్ అయిన మధుర, ఆమెను గట్టిగా నెట్టివేసింది. మళ్లీ లేవగా, వెనుక నుంచి చేతులతో మెలివేసి మంచంపైకి నెట్టి చంపినట్లు DSP ప్రసన్నకుమార్ తెలిపారు. మధురను అరెస్ట్ చేశామన్నారు.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 17h ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.