సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

TG: సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండలం బాచుపల్లి దగ్గర్లో తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నాలుగేళ్ల చిన్నారితోపాటు ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురికి తీవ్రంగా గాయాలయ్యాయి. విదేశాల నుంచి వచ్చే బంధువును తీసుకురావడానికి నాందేడ్ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వాళ్ళని నారాయణఖేడ్ హాస్పిటల్ తరలించారు.



