తాకట్టు బంగారం మాయం.. కస్టమర్లకు షాక్

AP: అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం ద్రాక్షారామం మణప్పురం బ్రాంచ్లో కొందరు కస్టమర్లు తమ బంగారాన్ని తాకట్టు పెట్టి డబ్బులు తీసుకున్నారు. 8 మంది కస్టమర్లు తాకట్టు పెట్టిన బంగారం మాయమైంది. ఆ బంగారం స్థానంలో నకిలీ నగలు పెట్టారు. మొత్తం రూ.20లక్షల విలువైన 151 గ్రాముల బంగారం మాయమైంది. మణప్పురం మాజీ మేనేజర్ నగేశ్ మోసం చేసినట్లు ఆడిట్లో తేలింది. పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. అతడు ఉద్యోగం మానేసి చెన్నై వెళ్లినట్లు గుర్తించారు. నగేష్ను పట్టుకునేందుకు ముమ్మరంగా గాలిస్తున్నారు.



