ప్రమాద బాధితులను ఆదుకోవాలి: విడదల రజిని

AP: చిలకలూరిపేటలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందడం, పలువురు గాయపడటంపై మాజీ మంత్రి విడదల రజిని తీవ్ర దిగ్భ్రాంతి, సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపిన ఆమె, ప్రభుత్వం వెంటనే ఎక్స్గ్రేషియా ప్రకటించి బాధిత కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని, ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

