కొత్త యాప్తో రైతులకు కష్టాలు

TG: మెదక్ జిల్లాలో కొత్త ఎరువుల బుకింగ్ యాప్ రైతులకు కొత్త తిప్పలు తెచ్చిపెట్టింది. యాప్లో అన్ని వివరాలు నమోదు చేసి యూరియా బుక్ చేసేలోపే స్టాక్ ఖాళీగా చూపిస్తుండటంతో అన్నదాతలు <a href="https://www.theclearcutnews.com/n/VbwizMx">ఆందోళన</a> చెందుతున్నారు. ఆండ్రాయిడ్ ఫోన్, ఫార్మర్ రిజిస్ట్రీ, ఆధార్కు మొబైల్ నంబర్ లింక్ వంటి నిబంధనలు చిన్న, సన్నకారు రైతులకు ఇబ్బందిగా మారాయి. యాప్ ఓపెన్ అయ్యేందుకు గంటల తరబడి వేచి చూసినా, బుకింగ్ చేసేలోపే స్టాక్ నిల్ అవుతోందని రైతులు వాపోయారు. చేగుంట, రామాయంపేట ప్రాంతాల్లో రైతులు నిరసనలు చేపట్టారు.



